ఇంజినీరింగ్‌లో రికార్డ్ ప్రవేశాలు, AP EAPCET 2025 ఫస్ట్ దశలో 1.18 లక్షల సీట్లు భర్తీ

manohar

Updated On: July 25, 2025 12:52 PM

AP EAPCET 2025 ఫస్ట్ దశలో 1,18,525 కన్వీనర్ కోటా సీట్లు భర్తీ అయ్యాయి.మొత్తం సీట్లలో 77.85%కి సీట్లు కేటాయించారు.రాష్ట్ర విభజన తర్వాత కన్వీనర్ కోటాలో ఇంత పెద్ద సంఖ్యలో సీట్లు నిండడం ఇదే మొదటిసారి.పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.

ఇంజినీరింగ్‌లో రికార్డ్ ప్రవేశాలు, AP EAPCET 2025 ఫస్ట్ దశలో 1.18 లక్షల సీట్లు భర్తీఇంజినీరింగ్‌లో రికార్డ్ ప్రవేశాలు, AP EAPCET 2025 ఫస్ట్ దశలో 1.18 లక్షల సీట్లు భర్తీ

AP EAPCET 2025లో  కన్వీనర్ కోటాలో రికార్డు, 1.18 లక్షల సీట్లు కేటాయింపు పూర్తి(AP EAPCET 2025 sets record in convenor quota, 1.18 lakh seats allotted): AP EAPCET 2025 ఇంజినీరింగ్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటా కింద భారీ స్థాయిలో ప్రవేశాలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,52,246 సీట్లలో 1,18,525 సీట్లు భర్తీ కావడం ద్వారా 77.85% సీట్లకు అభ్యర్థులు ఎంపికయ్యారు. ఇది రాష్ట్ర విభజన తరువాత కన్వీనర్ కోటాలో నమోదైన అత్యధిక ప్రవేశాలుగా గుర్తించబడింది. గత ఏడాది 1.17 లక్షల సీట్లు భర్తీ కాగా, ఈసారి ఆ సంఖ్యను మించిపోయింది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోని 7,708 సీట్లలో 6,860 సీట్లు, 10 ప్రైవేట్ యూనివర్సిటీల్లోని 12,003 సీట్లలో 10,892 సీట్లు, అలాగే 210 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఉన్న 1,32,535 సీట్లలో 1,00,773 సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 1,84,020 మంది విద్యార్థులు అర్హత సాధించగా, కౌన్సెలింగ్‌కు 1,26,033 మంది హాజరయ్యారు. వీరిలో 1,24,655 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేయగా, 1.18 లక్షల మందికి సీట్లు కేటాయించబడ్డాయి. వెబ్ ఆప్షన్ల ప్రక్రియ, సీటు కేటాయింపు పద్ధతి ద్వారా పూర్తిగా వివరాలతో నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు.

ఈసారి సీట్ల భర్తీ స్థాయి పెరగడానికి పలు కీలక కారణాలు ఉన్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) గతంలో విధించిన ప్రవేశాల సంఖ్య పరిమితులను సడలించడం వల్ల కళాశాలలు కొత్త బ్రాంచిలను ప్రారంభించేందుకు అనుమతులు పొందాయి. ఇప్పటికే నిబంధనల ప్రకారం ప్రతి బ్రాంచ్‌కు గరిష్ఠంగా 240 సీట్లు ఉండే లిమిట్‌ను తొలగించడంతో ప్రవేశాల సంఖ్య బాగా పెరిగింది. అదనంగా, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల తగ్గుదల నేపథ్యంలో, ప్రతీ యూనివర్సిటీ ఒక్కో ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించినట్లు సమాచారం. అయితే, కోర్ ఇంజినీరింగ్ బ్రాంచులకు విద్యార్థుల ఆసక్తి తగ్గడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 41 కళాశాలల్లో 66 బ్రాంచిల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. ఇవి మెకానికల్, సివిల్, ఈఈ వంటి కోర్ విభాగాలే కావడం గమనార్హం. విద్యార్థులు ఇప్పుడు అధునాతన సాంకేతిక కోర్సులు  కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి బ్రాంచుల వైపు మొగ్గు చూపుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కాలేజీలు కూడా కొత్త బ్రాంచులకు ఎక్కువ సీట్లు కేటాయించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇక రెండవ విడత కౌన్సెలింగ్ త్వరలో ప్రారంభం కానుండగా, ఇంకా సీటు పొందని విద్యార్థులు ఆ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/ap-eapcet-2025-phase-1-counselling-seat-allotment-details-69176/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy