AP ఇంటర్ 2026 జవాబు పత్రాల మూల్యాంకనం ఈ రోజు నుండి ప్రారంభం కానుంది. తప్పుగా మార్కులు ఇచ్చినట్లయితే లెక్చరర్లకు భారీ జరిమానాలు ఉంటాయని AP ఇంటర్ బోర్డు తెలియజేసింది.
AP Inter Evaluation 2026AP ఇంటర్ ఆన్సర్ పత్రాల మూల్యంకనం ఈ రోజు నుండి ప్రారంభం (Evaluation of AP Inter exam answer sheets begins today): ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఉత్సాహంగా నిర్వహించబడుతున్నాయి. ఫిబ్రవరి 23న ప్రారంభమైన ఈ పరీక్షలు మార్చి 25వరకు కొనసాగుతున్నాయి. ఈ సారి AP ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 10,57,312 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు చివరి దశకు చేరినప్పటికి విద్యార్థులు మరియు తల్లిదండ్రుల దృష్టి ఇప్పుడు ఫలితాలపై దృష్టి పడింది. ముఖ్యంగా ఆన్సర్ పత్రాల మూల్యాంకనం ఎలా జరుగుతుందో అంటే ఎక్కువ ఆసక్తి పెరిగింది.
AP ఇంటర్ పరీక్షలు ముగిసిన వెంటనే ఈ రోజు మార్చి 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆన్సర్ పత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది . అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి 25 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకన కేంద్రాలను సిద్ధం చేశారు. మూల్యాంకనం వేగంగా పూర్తయ్యేలా ప్రత్యేక ప్రణాళిక అమలులో ఉంది. ప్రతి జూనియర్ లెక్చరర్కు రోజుకు ఉదయం 15, మధ్యాహ్నం 15 పేపర్లు ఇవ్వాలని నిర్ణయించారు. క్రమబద్ధతతో, సమయపాలనతో ఈ ప్రక్రియను పూర్తి చేయడమే అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
AP ఇంటర్ మూల్యాంకనంలో కఠిన సూచనలు అమలు (Strict guidelines implemented in AP Inter evaluation)
AP ఇంటర్ 2026 విద్యార్థులకు న్యాయం జరిగేలా ఇంటర్ బోర్డు స్పష్టమైన నియమాలు జారీ చేసింది.
- సమాధానాలు పూర్తిగా చదివిన తర్వాతే మార్కులు ఇవ్వాలి.
- సరైన సమాధానానికి చేతిరాత ఆధారంగా మార్కులు తగ్గించకూడదు.
- విద్యార్థి నేపథ్యం లేదా ఊహాగానాలు పరిగణలోకి తీసుకోకూడదు
- మార్కులు స్పష్టంగా బబుల్ చేయాలి
- మూల్యాంకన తర్వాత తిరిగి పరిశీలన తప్పనిసరి
AP ఇంటర్ మూల్యాంకనంలో తప్పిదాలకు భారీ జరిమానాలు (Heavy fines for mistakes in AP Inter evaluation)
AP ఇంటర్ నిర్లక్ష్యం లేదా పొరపాట్లపై లెక్చరర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు హెచ్చరించింది.
- పేపర్ మూల్యాంకనం చేసిన వారికి రూ.3,000 నుంచి రూ.7,500 వరకు జరిమానా
- పేపర్ పరిశీలించిన వారికి రూ.2,000 నుంచి రూ.3,750 వరకు జరిమానా
- మార్కుల వ్యత్యాసం ఎక్కువగా ఐతే సంబంధిత సిబ్బందిని మూల్యాంకనం నుంచి డీబార్ చేస్తారు
- నిర్లక్ష్యంగా మూల్యాంకనం చేసిన వారిపై అదనపు చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది.
ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు విడుదలకు సిద్ధం (Inter results set to be released in the second week of April)
AP ఇంటర్ ఫలితాల మూల్యాంకనాన్ని వేగంగా పూర్తి చేసి ఏప్రిల్ రెండో వారంలో ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రణాళిక రూపొందించింది. పరీక్షలతోనే మూల్యాంకనం ప్రారంభమైనప్పటి నుంచి ఫలితాల ప్రకటనలో ఆలస్యం ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఇది జరుగుతుంది. దీంతో విద్యార్థులు తమ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈసారి AP ఇంటర్ ఫలితాల మూల్యంకనం కఠిన నిబంధనల మధ్య పారదర్శకంగా జరుగుతుంది. విద్యార్థుల కష్టానికి న్యాయం జరగేలా ఈ చర్యలు తీసుకోవడం ఫలితాలపై నమ్మకాన్ని పెంచుతోంది.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

