రేపటి నుంచే జేఈఈ మెయిన్ 2025 పరీక్షలు, అభ్యర్థులు ఈ రూల్స్ పాటించాల్సిందే (JEE Main 2025 Exam Day Guidelines)జేఈఈ మెయిన్ 2025 ఎగ్జామ్ డే గైడ్ లైన్స్ (JEE Main 2025 Exam Day Guidelines) : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రేపటి నుంచి అంటే జనవరి 22 నుంచి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE Main 2025) 2025 సెషన్ 1ని నిర్వహించనుంది. పేపర్ 1 (BE/BTech) కోసం పరీక్షలు జనవరి 22, 23, 24, 2025 తేదీల్లో నిర్వహించబడతాయి. రెండు షిఫ్ట్లలో మొదటి షిప్టు పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. పేపర్ 2A (B Arch), పేపర్ 2B (B Planning), పేపర్ 2A, 2B (BArch, BPlanning రెండూ) పరీక్ష జనవరి 28, 29, 30, 2025 తేదీలలో జరుగుతుంది. పరీక్ష మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6/6:6:30 గంటల వరకు జరుగుతుంది.జేఈఈ మెయిన్ 2025 ఎగ్జామ్ డే (JEE Main 2025 Exam Day Guidelines) గైడ్లైన్స్ ఈ దిగువున అందించడం జరిగింది.
జేఈఈ మెయిన్ 2025 మార్కింగ్ స్కీమ్ (JEE Main 2025 Marking scheme)
ప్రశ్నకు సమాధానమివ్వడానికి, అభ్యర్థులు సరైన సమాధానానికి లేదా అత్యంత సముచితమైన సమాధానానికి సంబంధించిన ఒక ఆప్షన్ను ఎంచుకోవాలి. కీ వెరిఫికేషన్ సవాళ్ల ప్రక్రియ తర్వాత ఏదైనా వ్యత్యాసం కనుగొనబడినట్లయితే, NTA దానిని కింది పద్ధతిలో పరిష్కరిస్తుంది.- ప్రతి సరైన సమాధానానికి లేదా చాలా సరైన సమాధానానికి నాలుగు మార్కులు ఇవ్వబడతాయి.
- ఏదైనా తప్పుగా గుర్తించబడిన ఎంపిక కోసం విద్యార్థులకు నెగిటివ్ మార్కింగ్ (-1) ఉంటుంది.
- సమాధానం ఇవ్వని/సమీక్ష కోసం గుర్తు పెట్టబడిన వాటికి 0 మార్కును ఇస్తారు.
- ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు సరైనవని గుర్తించినట్లయితే, సరైన ఎంపికలలో దేనినైనా గుర్తించిన వారికి మాత్రమే నాలుగు మార్కులు (+4) ఇస్తారు.
- అన్ని ఆప్షన్లు సరైనవని గుర్తించినట్లయితే, ప్రశ్నను ప్రయత్నించిన వారందరికీ నాలుగు మార్కులు (+4) ఇవ్వడం జరుగుతుంది.
JEE Main 2025 అభ్యర్థులకు సూచనలు (JEE Main 2025 Exam Day Guidelines)
జేఈఈ మెయిన్ 2025కు హాజరవుతున్న అభ్యర్థులు ఈ కింది సూచనలను కచ్చితంగా పాటించాలి.- అభ్యర్థులు పరీక్షా కేంద్రంలో సమయానికి అంటే పరీక్ష ప్రారంభానికి రెండు గంటల ముందు రిపోర్ట్ చేయాలి. ట్రాఫిక్ జామ్, రైలు/బస్సు ఆలస్యం మొదలైన కారణాల వల్ల అభ్యర్థులు సమయానికి రిపోర్ట్ చేయకపోతే, పరీక్షా గదులు/హాళ్లలో ప్రకటించాల్సిన కొన్ని ముఖ్యమైన సూచనలను వారు కోల్పోయే అవకాశం ఉంది. అభ్యర్థి పరీక్షా కేంద్రానికి చేరుకోవడంలో ఆలస్యమైనా NTA బాధ్యత వహించదు.
- పరీక్ష గది/హాల్లో ప్రవేశం కోసం అభ్యర్థి తప్పనిసరిగా NTA వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయబడిన/ముద్రించబడిన అడ్మిట్ కార్డుని చూపించాల్సి ఉంటుంది. విధుల్లో ఉన్న పరీక్ష కేంద్ర సిబ్బంది అభ్యర్థుల గుర్తింపును ధ్రువీకరించాడనికి అధికారం కలిగి ఉంటారు. గుర్తింపు ఆధారాలను ధ్రువీకరించడానికి, నిర్ధారించడానికి చర్యలు తీసుకోవచ్చు.
- ప్రతి అభ్యర్థికి రోల్ నెంబర్ సూచించే సీటు కేటాయించబడుతుంది. అభ్యర్థులు తమకు కేటాయించిన సీట్లలో మాత్రమే కూర్చోవాలి. ఒకవేళ అభ్యర్థి తన సీటును మార్చుకునే సాహసం చేసి, కేటాయించిన సీట్లో కూర్చోకపోతే, అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తారు.
- అడ్మిట్ కార్డులో సూచించిన అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ ప్రకారం కంప్యూటర్లో అందుబాటులో ఉన్న ప్రశ్నపత్రం ఉందని అభ్యర్థి నిర్ధారించుకోవాలి. ఒకవేళ ప్రశ్నపత్రంలోని సబ్జెక్ట్ అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ కాకుండా వేరేది అయితే, దానిని సంబంధిత ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకువెళ్లాలి.
- ఏ కారణం చేతనైనా పరీక్ష షెడ్యూల్ తేదీకి హాజరు కాలేని వారికి, NTA ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి పరీక్ష నిర్వహించదు.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















