మేరా యువ భారత్ వాలంటీర్ 2025, యువత కోసం వాలంటీర్ అవకాశం

manohar

Updated On: October 13, 2025 04:03 PM

మేరా యువ భారత్ వాలంటీర్ 2025 కోసం యువతను నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన వాలంటీర్లు సామాజిక సేవల్లో పాల్గొనడం ద్వారా నెలకు రూ.5,000 స్టైపెండ్ పొందవచ్చు.

మేరా యువ భారత్ వాలంటీర్ 2025, యువత కోసం వాలంటీర్ అవకాశంమేరా యువ భారత్ వాలంటీర్ 2025, యువత కోసం వాలంటీర్ అవకాశం

మేరా భారత్ యువ వాలంటీర్ 2025 (Mera Bharat Yuva Volunteer 2025): కేంద్ర ప్రభుత్వం మేరా భారత్ యూత్ వాలంటీర్ 2025 కార్యక్రమం ద్వారా సమాజ సేవలో పాల్గొనాలనుకునే యువతకు అవకాశాలు ఇచ్చింది. పదో తరగతి ఉత్తీర్ణత కలిగిన, 18 నుండి 29 ఏళ్ల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు ఈ వాలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. మొత్తం 20 మంది వాలంటీర్లు ఎంపిక చేయబడతారు. ఎంపికైనవారు ఒక ఏడాది పాటు సమాజ సేవ కార్యక్రమాల్లో పాల్గొని తమ బ్లాక్‌లలో యువజనులు, మహిళా సంఘాలతో సమన్వయం చేసి ఆరోగ్యం, అక్షరాస్యత, పచ్చదనం-పరిశుభ్రత, మహిళా సాధికారత వంటి రంగాల్లో సేవలు అందించాలి. వారికి ప్రతి నెల రూ.5,000 వరకు స్టైఫండ్ ఇవ్వబడుతుంది. దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 15, 2025 వరకు చేయవచ్చు.

మేరా భారత్ యూత్ వాలంటీర్ దరఖాస్తు ఫారం లింక్ 2025 (Mera Bharat Youth Volunteer Application Form Link 2025)

ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా  మేరా భారత్ యూత్ వాలంటీర్ ఫారం లింక్ 2025 ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

మేరా భారత్ యూత్ వాలంటీర్ దరఖాస్తు విధానం 2025 (Mera Bharat Youth Volunteer Application Procedure 2025)

మేరా భారత్ యూత్ వాలంటీర్ పోస్టులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవచ్చు . దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్ధులు ఈ క్రింద దశలను పాటించండి.

  • ముందుగా అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ చేసి ఆన్‌లైన్ ఫారం నింపాలి.
  • వ్యక్తిగత, విద్యా మరియు ఇతర అవసరమైన వివరాలు సరిగ్గా నమోదు చేయాలి.
  • అవసరమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి (అడ్మిషన్ సర్టిఫికెట్, ఐడీ ప్రూఫ్, ఫోటో).
  • దరఖాస్తు సమర్పించిన తర్వాత ప్రింట్ కాపీని భద్రపరచుకోవడం మర్చిపోకండి.
  • దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ 15,2025.

మేరా భారత్ యూత్ వాలంటీర్ కోసం ముఖ్యమైన సూచనలు (Important Instructions for Mera Bharat Youth Volunteer)

వాలంటీర్‌గా దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు ఈ సూచనలు గమనించండి.

  • దరఖాస్తు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడుతుంది.
  • వయస్సు 18 నుండి 29 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.
  • అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
  • ఎంపికైన వాలంటీర్లు ఒక సంవత్సరం సేవలో పాల్గొనాలి.
  • ప్రతి నెలకు రూ.5,000 వరకు స్టైపెండ్ అందుతుంది.
  • దరఖాస్తు చివరి తేది: 15 అక్టోబర్ 2025.

మేరా యువ భారత్ వాలంటీర్ 2025 ప్రోగ్రామ్ ద్వారా యువతకు సమాజ సేవలో పాల్గొనటానికి మరియు అనుభవం పొందడానికి అవకాశం ఉంది. ఆసక్తి ఉన్నవారు త్వరగా దరఖాస్తు చేసి సమాజానికి సేవ చేయడం ప్రారంభించవచ్చు.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/mybharat-youth-volunteer-2025-72646/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy