JEE అడ్వాన్స్డ్ పరీక్షా కేంద్రాల సంఖ్యలో మార్పులు, తెలుగు రాష్ట్రాల్లో ఇవే పరీక్షా కేంద్రాలు
JEE అడ్వాన్స్డ్–2026 పరీక్ష మే 17న జరగనుంది. ఈ పరీక్షకు తెలంగాణలో 13 నగరాలు, ఆంధ్రప్రదేశ్లో 24 నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. JEE మెయిన్లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఈ పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది.
JEE అడ్వాన్స్డ్–2026 పరీక్ష కేంద్రాల వివరాలు (JEE Advanced–2026 Exam Center Details): JEE అడ్వాన్స్డ్–2026 పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఐఐటీ రూర్కీ విడుదల చేసిన ఇన్ఫర్మేషన్ బులెటిన్లో వెల్లడించారు. ఐఐటీల్లో బీటెక్, బీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షను దేశవ్యాప్తంగా మే 17, 2026న నిర్వహిస్తారు. JEE అడ్వాన్స్డ్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రవేశ పరీక్షలలో ఒకటి అయినందున లక్షలాది మంది విద్యార్థులు దీనికి సిద్ధమవుతున్నారు.
ఈ ఏడాది పరీక్షా కేంద్రాల సంఖ్యలో స్వల్ప మార్పులు చేశారు. గత సంవత్సరం కంటే ఈ సరి పరీక్షా కేంద్రాల సంఖ్య కొంత తగ్గించినప్పటికీ, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వివిధ ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహణ సక్రమంగా సాగే విధంగా కావలసిన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేస్తున్నామని అధికారులు తెలిపారు. పరీక్షా విధానం, సమయాలు, నిబంధనలపై స్పష్టత కోసం ఇన్ఫర్మేషన్ బులెటిన్ను జాగ్రత్తగా చదవాలని సూచించారు.
JEE అడ్వాన్స్డ్ పరీక్ష రాయాలంటే ముందు JEE మెయిన్లో కనీస అర్హత స్కోర్ సాధించాలి. JEE మెయిన్ ఫలితాల ఆధారంగా టాప్ 2.50 లక్షల మంది అభ్యర్థులకు మాత్రమే అడ్వాన్స్డ్ పరీక్షకు అనుమతి ఉంటుంది. అలాగే, పరీక్షా కేంద్రాల ఎంపిక కోసం అభ్యర్థులు ముందే నగరాలు/పట్టణాల ప్రాధాన్యత ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వాటిని పరిగణనలోకి తీసుకుని పరీక్షా కేంద్రాలు కేటాయిస్తారు.
పరీక్ష ఫలితాల విడుదలైన తర్వాత అభ్యర్థుల ర్యాంక్ వివరాలు వారి మొబైల్ ఫోన్లకు పంపే విధానం కొనసాగనుంది. దీని వల్ల విద్యార్థులు త్వరగా తమ ర్యాంక్ తెలుసుకొని తదుపరి ప్రవేశ ప్రక్రియకు సిద్ధం అయ్యే అవకాశం ఉంటుంది. కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు వంటి దశల్లో ఈ ర్యాంక్లు కీలకంగా ఉంటాయి.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో దేశంలోని 23 ఐఐటీల్లో మొత్తం 18,160 B.Tech, B.Sc సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే 2026–27 విద్యా సంవత్సరం నుంచి సీట్ల సంఖ్య పెరుగవచ్చని అధికారులు సూచిస్తున్నారు. దీనితో మరిన్ని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఐఐటీల్లో చదవడానికి అవకాశం విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి.
JEE అడ్వాన్స్డ్ పరీక్షా కేంద్రాల పేర్లు (Names of JEE Advanced exam centers)
తెలంగాణ (13 కేంద్రాలు) Telangana (13 centers):
ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.
ఆంధ్రప్రదేశ్ (24 కేంద్రాలు) (Andhra Pradesh (24 centers)) :
శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అమలాపురం, అనంతపురం, భీమవరం, చీరాలు, చిత్తూరు, ఏలూరు, గుడ్లవల్లెరు, గూడూరు, కడప, కాకినాడ, కర్నూలు, మార్కాపురం, మైళవరం, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.