UPSC మెయిన్స్ ఫలితాలు 2025 విడుదల, 97 మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
UPSC మెయిన్స్ 2025 ఫలితాలను విడుదల చేసింది. అసిస్టెంట్ డైరెక్టర్, మార్కెటింగ్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు 97 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది.ఫలితాల గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూడండి.
UPSC మెయిన్స్ 2025 ఫలితాలు విడుదల (UPSC Mains 2025 Results Released):యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నవంబర్లో నిర్వహించిన నియామక పరీక్షలకు సంబంధించిన UPSC మెయిన్స్ రిజల్ట్స్ 2025ను అధికారికంగా ప్రకటించింది. ఈ ఫలితాల ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ (సివిల్ ఏవియేషన్), మార్కెటింగ్ ఆఫీసర్ గ్రూప్–1 (వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ), మరియు EPFOలో పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు మొత్తం 97 మంది అభ్యర్థులను సిఫార్సు చేశారు. ఎంపికైన వారికి వ్యక్తిగతంగా సమాచారం పంపించగా, మిగతా అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించినప్పటికీ వారిని ఇంటర్వ్యూకి లేదా నియామకానికి సిఫార్సు చేయలేదని UPSC స్పష్టం చేసింది. ఫలితాల PDFలో పోస్టుల వివరాలు, రోల్ నంబర్లు, ఎంపికైన అభ్యర్థుల పేర్లు వంటి ముఖ్య సమాచారం అందుబాటులో ఉంది. కొన్ని రిజర్వ్డ్ కేటగిరీ పోస్టులకు సరైన అభ్యర్థులు లభించకపోవడంతో అవి ఖాళీగా ఉంచబడ్డాయని, అలాగే కొన్ని కేసులు న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్నందున ఫైనల్ ఫలితాలు వాటి తీర్పులకు ఆధారపడి ఉంటాయని కమిషన్ పేర్కొంది.
UPSC మెయిన్స్ రిజల్ట్స్ 2025 లింక్ (UPSC Mains Results 2025 Link)
UPSC మెయిన్స్ 2025కి సంబంధించిన అధికారిక ఫలితాలను అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ ద్వారా చెక్ చేయవచ్చు.
UPSC మెయిన్స్ రిజల్ట్స్ 2025 ఎలా చెక్ చేయాలి? (How to check UPSC Mains Results 2025?)
UPSC మెయిన్స్ 2025 ఫలితాలను క్రింది విధంగా సులభంగా ఆన్లైన్లో చెక్ చేయొచ్చు.
- ముందుగా upsc.gov.in అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేయండి
- ఆ తరువాత హోమ్పేజిలోని Recommended Candidates List లింక్పై క్లిక్ చేయండి
- సంబంధిత పోస్టుల ఫలితాల PDF ఫైల్ స్క్రీన్పై ఓపెన్ అవుతుంది
- మీ రోల్ నంబర్ / పేరును జాబితాలో పరిశీలించండి
- భవిష్యత్ అవసరాల కోసం ఆ PDFను డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోండి
అసిస్టెంట్ డైరెక్టర్ కోసం 42 మంది, మార్కెటింగ్ ఆఫీసర్ గ్రూప్–1 కోసం 33 మంది షార్ట్లిస్ట్ (42 candidates shortlisted for Assistant Director, 33 candidates shortlisted for Marketing Officer Group-1):
UPSC విడుదల చేసిన ఎంపిక జాబితా ప్రకారం, పోస్టులవారీగా అభ్యర్థుల ఎంపిక వివరాలు విడుదలయ్యాయి. సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ పరిధిలోని అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు 42 మంది, వ్యవసాయ & రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలోని మార్కెటింగ్ ఆఫీసర్ గ్రూప్–1 పోస్టులకు 33 మంది, EPFOలోని పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు 22 మంది ఎంపికైనట్లు పేర్కొన్నున్నారు. ఈ వివరాలు UPSC విడుదల చేసిన ఫలితాల PDFలో పొందుపరచబడ్డాయి.
అధికారిక PDFలో ప్రతి పోస్టు పేరు, ఎంపికైన అభ్యర్థుల పేర్లు, రోల్ నంబర్లు వంటి కీలక సమాచారాన్ని స్పష్టంగా చూడొచ్చు. ఎంపికైన వారికి పోస్టు ద్వారా వ్యక్తిగతంగా సమాచారం పంపినట్లు కమిషన్ తెలిపింది. ఇతర అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించినప్పటికీ, వారిని ఇంటర్వ్యూకు పిలవడం లేదా పోస్టులకి సిఫార్సు చేయడం సాధ్యం కాలేదని కమిషన్ పేర్కొంది.
ఇక రిజర్వ్డ్ కేటగిరీలను చూస్తే, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులలో EWS కోటాకు కేటాయించిన 7 పోస్టులకు సరైన అభ్యర్థులు నిలబడలేదని UPSC తెలిపింది. అలాగే 1 EWS, 1 OBC పోస్టులను కొన్ని న్యాయస్థానాల్లో పెండింగ్ ఉన్న కేసుల కారణంగా ఖాళీగా వదిలినట్లు కూడా తెలిపింది. ఈ ఫలితాలు OA No. 3486/2025 మరియు 3500/2025 (CAT, న్యూఢిల్లీ) కేసుల తుది తీర్పులపై ఆధారపడి ఉంటాయని UPSC పేర్కొంది. అదే సమయంలో EPFO పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల విషయంలో SC–46, ST–24, OBC–85, EWS–30, Unreserved–116 పోస్టులకి సరైన అభ్యర్థులు కలగలేదని UPSC స్పష్టం చేసింది.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.