RGUKT అడ్మిషన్ నోటిఫికేషన్లు విడుదల 2025(RGUKT ADMISSIONS NOTIFICATIONS 2025)

manohar

Updated On: April 25, 2025 02:57 PM

RGUKT AP IIIT అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలయింది. 10 వ తరగతి పాసైన విద్యార్థులు RGUKT కి దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం ఈక్రింద చూడండి.

RGUKT అడ్మిషన్ నోటిఫికేషన్లు విడుదల 2025RGUKT అడ్మిషన్ నోటిఫికేషన్లు విడుదల 2025

RGUKT AP IIIT అడ్మిషన్లు 2025(RGUKT AP IIIT Admissions 2025) : ఆంధ్రప్రదేశ్‌లో రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT AP) నిర్వహిస్తున్న నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లు-(ఆర్కే వ్యాలీ ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు) 2025-26 విద్యా సంవత్సరానికి గాను పీయూసీ-బీటెక్‌ (రెండేళ్లు పీయూసీ, నాలుగేళ్లు బీటెక్) ప్రవేశాలకు సంబంధించిన షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్‌ 27 నుంచి మే 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్‌ 5వ తేదీన విడుదల చేస్తారు. అనంతరం జూన్‌ 11 నుంచి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.RGUKT AP అధికారులు ఈసారి వీలైనంత త్వరగా AP IIIT ప్రేవేశ ప్రక్రియను  ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు. నోటిఫికేషన్ విడుదల తర్వాత వీలైనంత వేగంగా ప్రవేశాల ప్రక్రియ చేపట్టి జూన్‌ నెలలో తరగతులు ప్రారంభమయ్యేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ వివరాలు, ఫలితాలు అన్నీ విషయాలను అధికారిక వెబ్‌సైట్‌ http://www.rgukt.in/ ద్వారా తెలుసుకోవచ్చు.

RGUKT AP ముఖ్యమైన తేదీలు(RGUKT AP Important Dates)

RGUKT AP పరీక్షా గురించి ముఖ్యమైన తేదీలు, అలాగే వివరాలు ఈ క్రింద టేబుల్ పట్టిక లో ఇచ్చాము చూడండి.

వివరాలు

తేదీలు

నోటిఫికేషన్ విడుదల తేదీ

ఏప్రిల్‌ 23, 2025

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం

ఏప్రిల్‌ 27, 2025

దరఖాస్తులకు చివరితేది

మే 20, 2025

తరగతుల ప్రారంభం

జూన్‌ లేదా  జులై నెలలో ప్రారంభమవుతాయి.

RGUKT AP ముఖ్యమైన వివరాలు(RGUKT AP Important Details) :

  • RGUKT AP నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో మొత్తం 4,400 సీట్లు భర్తీ చేస్తారు.
  • రాష్ట్ర విద్యార్థులకు 85 శాతం సీట్లు కేటాయిస్తారు.
  • మిగిలిన 15 శాతం సీట్లకు రాష్ట్రంతో పాటు తెలంగాణ విద్యార్థులు పోటీపడవచ్చు.
  • ఈ సీట్లను తెలంగాణ, ఏపీ విద్యార్థులకు ఓపెన్‌ మెరిట్‌ కింద కేటాయిస్తారు.
  • గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పాసైన విద్యార్థులు మాత్రమే ప్రవేశాలకు అర్హులు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
  • సర్కార్ బడుల్లో పదో తరగతి చదివిన విద్యార్థులకు 4 శాతం డిప్రివేషన్‌ స్కోర్‌ను యాడ్‌ చేసి మెరిట్‌ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
  • అయితే 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి రిజర్వేషన్‌ ఆధారంగా ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు భర్తీ చేస్తారన్న విషయం తెలిసిందే.
  • 10వ తరగతి మార్కులు, రిజర్వేషన్‌ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
  • RGUKT AP దరఖాస్తు ప్రక్రియ ముగిశాక కౌన్సెలింగ్‌కు సంబంధించిన కాల్ లెటర్లను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • విద్యార్థులు తమ ఆర్జీయూకేటీ అప్లికేషన్ నెంబరు, పదోతరగతి హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు ఎంటర్‌ చేసి కాల్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • అందులో పేర్కొన్న తేదీలు, కౌన్సెలింగ్‌ వేదిక వివరాలు చూసుకుని ఆ తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/rgukt-admissions-notifications-2025-65444/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy