SBI PO Recruitment 2023 Notification: 2000 బ్యాంకు ఉద్యోగాలు, నెలకు జీతం రూ.41,960, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడంటే?
ఎస్బీఐ పీవో రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ (SBI PO Recruitment 2023 Notification): స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. 2000 ప్రొబేషనరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈరోజు నుంచి అంటే సెప్టెంబర్ 7, 2023 నుంచి ప్రారంభం కానుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ Sbi.co.inకి లాగిన్ అయి అప్లికేషన్ ఫార్మ్ను ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. SBI PO నోటిఫికేషన్ (SBI PO Recruitment 2023 Notification) 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను, వివరాలను ఈ దిగువున అందజేశాం.
| ఎస్బీఐ పీవో రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ PDF- ఇక్కడ క్లిక్ చేయండి |
|---|
ఎస్బీఐ పీవో రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ (SBI PO Notification 2023 PDF)
ఎస్బీఐ పీవో రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను దిగువున టేబుల్లో అందించడం జరిగింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు పరిశీలించవచ్చు.| సంస్థ | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
|---|---|
| పరీక్ష పేరు | SBI PO ఎగ్జామ్ 2023 |
| పోస్ట్ | ప్రొబేషనరీ ఆఫీసర్ |
| ఖాళీలు | 2000 |
| SBI PO ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ | సెప్టెంబర్ 27, 2023 |
| SBI PO ప్రిలిమ్స్ ఎగ్జామ్ | నవంబర్ 23, 2023 |
| సెలక్షన్ ప్రాసెస్ | ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ టెస్ట్ |
| SBI PO పోస్టుల మెయిన్స్ ఎగ్జామ్ | డిసెంబర్ 2023, జనవరి 2023 |
| అధికారిక వెబ్2సైట్ | www.sbi.co.in/careers |
SBI PO పోస్టులు అర్హత ప్రమాణాలు (SBI PO Posts 2023 Eligibility Criteria)
SBI PO పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ దిగువున తెలిపిన అర్హతలు ఉండాలి.- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- అభ్యర్థి వయస్సు పరిమితి ఏప్రిల్ 1, 2023 నాటికి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.750లు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
SBI PO పోస్టుల ఎంపిక ప్రక్రియ (SBI PO Posts 2023 Selection Process)
SBI PO పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రాథమిక పరీక్ష తర్వాత ప్రధాన పరీక్ష ఉంటుంది. మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూకు హాజరు కావడానికి అర్హులవుతారు. ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 27, 2023వ తేదీకల్లా దరఖాస్తు చేసుకోవాలి.తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్పై క్లిక్ చేయండి.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?

















