School Assembly News Headlines for 1 July 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తలు కోసం ఇక్కడ చూడండి

Rudra Veni

Updated On: June 30, 2023 05:32 PM

స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాల కోసం ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తలను  (School Assembly News Headlines for 01 July 2023) ఇక్కడ అందజేయడం జరిగింది.
 
School Assembly News Headlines for 1 July 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తలు కోసం ఇక్కడ చూడండిSchool Assembly News Headlines for 1 July 2023: ఏపీ, తెలంగాణ, జాతీయ వార్తలు కోసం ఇక్కడ చూడండి

జూలై  01, 2023 స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 1 July 2023) ఇక్కడ ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం అన్ని తాజా అప్‌డేట్‌లను ఇక్కడ తెలుసుకోండి.

జూలై  01, 2023 కోసం స్కూల్ అసెంబ్లీ వార్తల ముఖ్యాంశాలు (School Assembly News Headlines for 1 July 2023)

ఆంధ్రప్రదేశ్ వార్తలు (Andhra Pradesh News)

  • ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సెజ్‌లోని సాహితీ ఫార్మాలో బాలు పేలుడు జరిగి మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి.
  • ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఘాటుగా విమర్శించారు. వైఎస్ జగన్ ముందు బకాసురుడు కూడా తక్కువేనన్నారు.
  • గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర ఓ మహిళా పోలీసు నిరసన వ్యక్తం చేశారు. లక్ష్మీ ప్రసన్న అనే మహిళా పోలీసులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. వైసీపీ నేతలు తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.

తెలంగాణ వార్తలు (Telangana News)

  • తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోడు పట్టాలన్నింటిని మహిళల పేరు మీదే అందించినట్టు కేసీఆర్ చెప్పారు.
  • ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ అన్నారు.
  • వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టులో విచారణ శుక్రవారం జరిగింది. వైఎస్ వివేకా హత్య కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్‌ని సీబీఐ అధికారులు దాఖలు చేశారు.
  • పీఎం నరేంద్ర మోదీ తాను సేవకుణ్ణి తప్ప ఓనరుని కాదంటారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం తామే చేస్తున్నామని చెబుతారని ఎద్దేవ చేశారు.

జాతీయ వార్తలు (National News)

  • ఢిల్లీ యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం హాజరై యూనివర్సిటీకి చెందిన మూడు భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మెట్రో ప్రయాణించారు. సాధారణ ప్రజలతో మాట్లాడారు.
  • మణిపూర్‌లో పర్యటిస్తోన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అక్కడి పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రజలను కలసి మాట్లాడిన రాహుల్ గాంధీ వారికి ఎదురైన కష్టం తన గుండెను కలిచివేసిందన్నారు.
  • మణిపూర్‌లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పర్యటనపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ విమర్శలు చేశారు. ప్రచారం కోసమే రాహుల్ గాంధీ ఇలా చేస్తున్నారని అన్నారు.
  • మహారాష్ట్రలోని పూణేలో కాంగ్రెస్ నేత రామకృష్ణ మోరెపై విడుదల చేసి పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ,  కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌ సింగ్ ‌పై ప్రసంశలు కురిపించారు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?

Say goodbye to confusion and hello to a bright future!

news_cta
/news/school-assembly-news-headlines-july-1-2023-42554/

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్

ఇప్పుడు ట్రెండ్ అవుతుంది

Subscribe to CollegeDekho News

By proceeding ahead you expressly agree to the CollegeDekho terms of use and privacy policy