SSC ముంబైలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా ప్రభావితమైన అభ్యర్థుల కోసం CGL 2025 మళ్లీ పరీక్షను అక్టోబర్ 14, 2025న నిర్వహించనుంది. పూర్తి సమాచారం ఇక్కడ అందించబడింది.

CGL 2025 రీ-ఎగ్జామ్ అక్టోబర్ 14న (CGL 2025 re-exam on October 14): SSC CGL 2025 పరీక్షకు సంబంధించి సిబ్బంది ఎంపిక సంఘం (SSC) ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ముంబైలోని ఒక కేంద్రంలో సెప్టెంబర్ 26న అగ్నిప్రమాదం వచ్చిన కారణం వల్ల అక్కడి అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు. ఈ ఘటనతో ప్రభావితులైన వారికి పరీక్ష రాసే అవకాశం కల్పించేందుకు అక్టోబర్ 14, 2025న తిరిగి పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది.దేశవ్యాప్తంగా పరీక్షలు సాధారణంగా విజయవంతంగా పూర్తయాయని SSC తెలిపింది. మొత్తం 28 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13.5 లక్షల మంది 126 నగరాల్లోని 255 కేంద్రాల్లో 15 రోజుల పాటు 45 షిఫ్టుల్లో హాజరయ్యారు. ముంబై ఘటన జరిగిన కేంద్రం తప్ప మిగిలిన అన్ని కేంద్రాల్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా పరీక్షలు కొనసాగించబడినట్లు పేర్కొంది.
పరీక్షల అనంతరం అభ్యర్థుల నుండి 18,000 కి పైగా ఫీడ్బ్యాక్లు అందాయి. కొంతమందికి సాంకేతిక సమస్యలు ఎదురైనట్లు SSC గుర్తించింది. ఈ ఫీడ్బ్యాక్లను డిజిటల్ ఆధారాలతో పరిశీలించి అవసరమైతే అవసరమైన అభ్యర్థులకు మరోసారి పరీక్ష రాయడానికి అవకాశం కల్పించామని సంస్థ స్పష్టం చేసింది. అలాగే పరీక్ష తేదీ మార్పు గురించి చేసిన అభ్యర్థుల అభ్యర్థనలను కూడా పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.ఈ సంవత్సరం SSC పరీక్షల్లో ల్యాప్టాప్ ఆధారిత పరీక్ష విధానం కొత్తగా ప్రవేశపెట్టారు. వేలాది మంది ఈ విధానంలో పరీక్ష రాసారని SSC తెలిపింది. భవిష్యత్తులో దీనిని విస్తరించగలిగితే మరిన్ని కేంద్రాలు కల్పించి పెద్ద సంఖ్యలో అభ్యర్థులను సులభంగా పరీక్ష చేయొచ్చని కమిషన్ ఒకసారి పేర్కొన్నది. అదే విధంగా ఆధార్ ఆధారిత ధృవీకరణ వ్యవస్థను కూడా విజయవంతంగా అమలు చేసి అభ్యర్థుల గుర్తింపును మరింత బలపరచినట్లు తెలిపారు.
పరీక్షల సమయంలో కొన్ని ఘటనలు వెలుగులోకి వచ్చాయి .అభ్యర్థులు నకిలీ పత్రాలు సమర్పించడం, స్రైబ్ సదుపాయాన్ని దుర్వినియోగం చేయడం, రిమోట్ యాక్సెస్ ద్వారా అక్రమంగా ప్రేవేశం చేయడానికి ప్రయత్నించడం వంటివి జరిగింది. ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డ వారిని శాశ్వతంగా పరీక్షల నుండి డిబార్ చేస్తామని SSC స్పష్టం చేసింది. తప్పు నిరూపించబడని అభ్యర్థులకు మాత్రం మళ్లీ పరీక్ష రాయడానికి అవకాశం ఇవ్వబడుతుందని కూడా తెలిపింది.రాబోయే పరీక్షల షెడ్యూల్ గురించి SSC పేర్కొన్న వివరాలు ఇవి: ఎంపిక పోస్టుల ప్రశ్నల ఛాలెంజ్ ఇప్పటికే ప్రారంభమైంది. CGL ఆన్సర్ కీ ఛాలెంజ్ అక్టోబర్ 15 నుంచి ప్రారంభం అవుతుంది. అదనంగా ఢిల్లీ పోలీసుల మరియు SI CPO 2025 దరఖాస్తుల విండోలు తెరవబడాయి. కానిస్టేబుల్ GD 2026 దరఖాస్తు విండో నవంబర్ 2025లో ప్రారంభం కానుంది. CHSL టైర్‑1 పరీక్ష అక్టోబర్ నాల్గవ వారంలో నిర్వహించనున్నారు, మరియు తరువాత SI CPO, JE, MTS వంటి ఇతర పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని SSC వివరించింది.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.
Are you feeling lost and unsure about what career path to take after completing 12th standard?
Say goodbye to confusion and hello to a bright future!
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగకరంగా ఉందా?



